Sampoorna Sri Ramayanam - 2025 | Day 22 | Brahmasri Chaganti Koteswara Rao garu
బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే "సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు" - 2025 l ఇరవై రెండవ రోజు (15-02-2025) కిష్కింధకాండ - మొదటి రోజు ప్రవచనము చంచలమైన స్వభావమును వదిలిపెట్టి సరైన ఆలోచనా విధానమును కలిగి ఉన్నప్పుడే రాజు సరిగ్గా పరిపాలన చేయగలుగుతాడని, శ్రీరాముడు స్వామి హనుమను కలిసిన మొట్టమొదటిసారి ఆయన వాగ్వైభవమును ఎంతగానో కీర్తించారని, ధర్మపరమైన సహాయమును ఎప్పుడూ అందించటం మిత్రుని యొక్క స్వభావమని శ్రీరాముడు తెలియజేశారని పూజ్య గురుదేవులు, "ప్రవచన రత్నాకర" బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా కిష్కింధకాండ పై వారి ప్రవచనములు ప్రారంభమైనవి. రామలక్ష్మణులు పంపా తీరములో విహరిస్తుండగా మలయ పర్వతము పైనున్న సుగ్రీవుడు వారిని చూచి, వాలి పంపించిన మహావీరులేమో అన్న భయముతో చెట్ల పైన, కొమ్మలపైన గిరగిరా చంచలముగా తిరుగుతూ ఉండగా మహామంత్రి అయిన స్వామి హనుమ అతనికి రాజు అట్లా ఉండరాదని, నిశ్చితాభిప్రాయమును కలిగి ఉండాలని, వారు మనుష్యుల వలే కనిపిస్తున్నారని, వాలి పంపించి ఉండకపోవచ్చు అని చెప్పినప్పటికీ దీర్ఘమైన బాహువులు, పరాక్రమోపేతమైన వారి రూపములను చూచిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూ స్వామి హనుమను వారెవరో తెలుసుకుని రమ్మని చెప్పి పంపించిన వైనమను గూర్చి శ్రీ గురువుగారు వివరించారు. రామలక్ష్మణులు ఎవరో తెలుసుకుందామని సన్యాసి రూపములో వెళ్ళిన హనుమ తాను ఉన్నది సన్యాసిరూపమైనా రామలక్ష్మణులను చూడగానే ఎంతో భక్తి భావము పెల్లుబికి, ఆయనే మొదట నమస్కారము చేసి, వారిని గొప్పగా స్తోత్రము చేసి కీర్తించి, వారెవరు అని అడుగగా, హనుమ మాట్లాడిన తీరుకు ఎంతగానో ఆశ్చర్యపోయిన శ్రీరాముడు లక్ష్మణునితో నాలుగు వేదములు, వేదాంగములు బాగా చదువుకున్న వారు కానీ ఇంత పొందికగా, చక్కగా, ఎదుటివారికి ఏ సంశయము కలుగకుండా, ప్రశాంతముగా మాట్లాడలేరని, ఇటువంటి మాత్రి ఉన్న రాజు ఎప్పటికీ ఇబ్బందులు పొందడని హనుమయొక్క బుద్ధివైభవమును మరియు వాగ్వైభవమును కీర్తించారని శ్రీ గురువుగారు తెలియజేశారు. హనుమ తాను సుగ్రీవుని మంత్రినని తెలియజేసి రామలక్ష్మణులను మలయ పర్వతం పైనున్న సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళగా రామసుగ్రీవులిద్దరూ ఒకరి గూర్చి మరొకరు తెలుసుకొని అగ్నిసాక్షిగా మైత్రీ బంధమును ఏర్పరచుకున్నారని ప్రవచనంలో వారు వివరించారు. శ్రీరాముడు సీతమ్మ యొక్క అపహరణను గూర్చి తెలియజేయగా సుగ్రీవుడు ఒక రాక్షసునిచే అపహరింపబడుతున్న ఒక స్త్రీ ఆకాశము నుండి పడవేసిన ఆభరణముల మూట తన వద్ద ఉన్నదని చెప్పి వాటిని చూపించగా, శ్రీరాముడు సీతమ్మ గుర్తొచ్చి, కళ్ళు చమర్చి, అవి గుర్తుపట్టలేక లక్ష్మణుని అడగగా, లక్ష్మణుడు మిగతా ఆభరణములకు తనకు తెలియవని, ఆ నూపురములు మాత్రం తాను రోజు నమస్కరించే సీతమ్మ పాదములకు అలంకరింపబడిన నూపురుములేనని, అవి సీతమ్మేనని గుర్తుపట్టిన సంఘటన ద్వారా లక్ష్మణుని యొక్క నిర్మలమైన మనసు మరియు భక్తి మనకు అర్థమవుతాయని వారు అభివర్ణించారు. ఆ రాక్షసుని వెంటనే నిర్జిస్తానని ఆగ్రహించిన శ్రీరాముడిని కొంత స్వస్థపరచుట కొరకు అతడు ఎవరో తనకు తెలియదని, వానరులను అన్ని దిక్కులకు పంపించి తెలుసుకునే ప్రయత్నం చేస్తానని సుగ్రీవుడు చెప్పిన విషయమును కూడా వివరించారు. అప్పుడు సుగ్రీవుడు తన వృత్తాంతమును తెలియజేస్తూ వాలి మరియు తాను దుందుభి అనే రాక్షసుని తరిమికొట్టుట, అతడు ఒక గుహలోకి ప్రవేశించగా వాలి ఆజ్ఞ మేరకు తాను బయట ఉండగా వాలి ఆ గుహలోకి వెళ్ళుట, ఒక సంవత్సరమైపోయినప్పటికీ వాలి బయటకు రాకపోవటము, వాలి అరుపులు వినిపించక కేవలం రాక్షసుల అరుపులు మాత్రమే వినిపించటంతో తాను అనుమానించి, ఆ గుహ నుండి దుందుభి మళ్ళీ బయటకు రాకుండా ఒక పర్వతమును అడ్డుపెట్టి తిరిగి తన రాజ్యమునకు వెళ్ళిపోగా మంత్రులందరూ తనకు రాజుగా పట్టాభిషేకం చేయుట, కొన్నాళ్లకు తిరిగి వచ్చిన వాలి తనను అనుమానించి నిందించుట, తాను ఏ తప్పు చేయలేదని ఇప్పుడు కూడా రాజ్యమును వాలికి సమర్పించి ఆయనకు ఛాత్ర చామరాదులను సమర్పిస్తానని చెప్పినా వినకుండా వాలి సుగ్రీవుని భార్యను కూడా అపహరించి సుగ్రీవుని కట్టు బట్టలతో రాజ్యము నుండి వెళ్ళగొట్టుట, సుగ్రీవుడు వాలి పంపించిన కొందరు వానరులను నిర్జించి, భూమి యొక్క అన్ని దిక్కులకు పారిపోయి, కారణాంతరముల చేత వాలి రాలేని మలయ పర్వతము పై నివసించుటను గూర్చి శ్రీరామునికి వివరించాడని, అప్పుడు ధర్మపరమైన విషయములో మిత్రునకు ఎప్పుడు సహకారం అందించవలసిన ధర్మము తనకు ఉన్నది కనుక వాలిని నిర్జించి సుగ్రీవునకు తిరిగి తన రాజ్యమును, భార్యను అప్పగిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేయుట వరకు నేటి ప్రవచనము సాగినది. పూజ్య గురువుగారు ప్రవచనములో స్వామి హనుమ శ్రీరాముని మొట్టమొదటిసారి కలుసుకున్న ఘట్టమును గూర్చి ప్రవచనం చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. ఎవ్వరూ ఎదురు చూడని విధముగా ఎక్కడనుండో గొప్ప మంగళధ్వనులు మ్రోగి, టపాకాయలు పేలి ఎంతో మంగళకరమైన వాతావరణము నెలకొంది. అట్లాగే శ్రీరామయంత్రం పైన అలంకరింపబడి ఉన్న పూలమాల జారి కిందకు పడటం సభలోని వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీరామాయణము పై ప్రవచనములు జరిగిన చోట తప్పకుండా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు అనే నమ్మకముతో పూజ్య గురువుగారు సభలో స్వామి హనుమకు ఒక ఆసనం వేయించి, ప్రతీరోజూ నమస్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న స్వామి హనుమ ఖచ్చితంగా అందరికీ తెలిసే విధముగా సభలో నడయాడారు అనే నమ్మకంతో సభలోని వారందరూ ఆనంద పరవశులైపోయారు

Sampoorna Sri Ramayanam - 2025 | Day 21 | Brahmasri Chaganti Koteswara Rao garu

Sampoorna Sri Ramayanam - 2025 | Day 23 | Brahmasri Chaganti Koteswara Rao garu

Govinda Namalu With Telugu Lyrics | గోవింద నామాలు | Govinda Govinda Song | Venkateswara Swamy Song

Sampoorna Sri Ramayanam - 2025 | Day 24 | Brahmasri Chaganti Koteswara Rao garu

భీష్మపర్వం 9 • భీష్ముని వీర విహారం • Bheeshma War in Kurukshetra • Chaganti • Mahabharatham

chaganti koteswara rao speeches | chaganti pravachanalu | omkaram today episode

Sundarakanda -2 by chaganti koteshwararao || సుందరకాండ-2 || చాగంటి కోటేశ్వరరావు.

Kurukshetra War By Chaganti Koteswara Rao Latest |కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం |Mahabharatham|Eha

భార్యాభర్తలు తప్పక చూడండి | couples | keerthanadevotionals

Sampoorna Sri Ramayanam - 2025 | Day 41 | Brahmasri Chaganti Koteswara Rao garu

Sri Sampoorna Ramayanam Day 35

Sampoorna Sri Ramayanam - 2025 | Day 26 | Brahmasri Chaganti Koteswara Rao garu

Chaganti Full speech about Karna.

గజేంద్ర మోక్షము|| చాగంటి కోటేశ్వరరావు గారి అధ్భుత ప్రవచనం|| చాగంటి|| chaganti gajendra moksham

Markandeya story | మార్కండేయుని కథ | chaganti koteswara rao latest pravachanam

Nama Ramayana | M.S. Subbulakshmi | Ram Bhajan | Sri Tulsidas | Carnatic Classical Song

Sundarakanda Part 1 |🔥సీత కోసం హనుమాన్ చేసిన మొదటి సాహసం 🔥| Sri Chaganti Pravachanam #chaganti

Sampoorna Sri Ramayanam - 2025 | Day 31 | Brahmasri Chaganti Koteswara Rao garu

23. Sampoorna Ramayanam part 23 by Sri Chaganti Koteswara Rao Garu

